14/09/2023
*జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తమై*
*అన్ని మండలాల వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి*
*ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ డిమాండ్*
ఆదిలాబాద్// ఇటివల కురిసిన వర్షాల కారణంగా అనేక రకాల వ్యాధులు ప్రభలుతున్నాయని ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వైరాల్ లాంటి జ్వరాలు తీవ్ర ఇబ్బంధులు కలిగిస్తాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ అన్నారు. మారుమూల ఆదివాసి ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన మెడిసిన్ అందుబాటులో ఉంచి, సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాలలో పారిశుధ్యం పధ్ధతులు పాటించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, క్రిమి సంహారక మందులు,బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ లాంటి చర్యలు నిరంతరం చేపట్టే విధంగా చూడాలని ఆయన కోరినారు ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలలో మీరు నిలవకుండా చూడాలని పశువుల దొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని ఆయన పిలుపునిచ్చారు