04/01/2023
కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లి : ఈ రోజు అనగా (4/01/2023), సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నందు ప్రకృతి వ్యవసాయం పై చర్చ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిధిగా *శ్రీ నరేంద్ర రెడ్డి* డి.పి.ఎం. ఏపీ. సి. ఎన్. ఎఫ్. నంద్యాల, పాల్గొని ప్రస్తుత తరుణం లొ, ప్రకృతి వ్యవసాయ ఆవశ్యకత గురించి వివరించారు. కనీసం మన ఇంటికి సరిపడైనా ప్రకృతి సేద్యం తో పండించాలని సూచించారు.
శ్రీమతి *జి ధనలక్ష్మి*, సీనియర్ సైంటిస్ట్, మాట్లాడుతూ, నేల యొక్క సారత్వాన్ని కొనసాగించాలంటే ప్రకృతి వ్యవసాయం ముఖ్యమని, రైతులందరు కనీసం ఒక ఎకరం లోనైనా ప్రకృతి వ్యవసాయం పాటించి సమస్యలను అనుభవం ఆధారంగా తెలపాలని తెలియచేసారు.
*రమణయ్య* శాస్త్రవేత్త మాట్లాడుతూ పంట వ్యర్థాలను కాల్చకుండ పొలం లోనే కలియ దున్నాలని తద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచగలమని, అలాగే భూ పరీక్ష ఆధారిత ఎరువులు వినియోగంపై అవగాహన కల్పించారు.
*డి బాలరాజు* శాస్త్రవేత్త ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవుల ఆవశ్యకతను వాటి వృద్ధికి చేయవలసిన పద్ధతులను వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వాటి తయారీ విధానాలను తెలియచేస్తూ, తక్కువ కూలీల తో ప్రకృతి వ్యవసాయం చేయగలమని తెలిపారు.
*ఆదినారాయణ* శాస్త్రవేత్త మాట్లాడుతూ పంటల మార్పిడి పై వివరించారు,అలాగే బహుళ పంటల విధానం పాటించి సంవత్సరం పొడవున నేల పంటలతో కప్పివుంచడం వల్ల అదిక ఆదాయం పొందవచ్చు అని తెలియజేశారు.
అనంతరం రైతులతో చర్చ నిర్వహించి వివిధ పంటలలోని సమస్యలకు పరిష్కరాలను సూచించారు. తరువాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ముత్యాలపాడు రైతు శ్రీ. పుల్లయ్య తాను సాగు చేస్తున్న 5 అంతస్తుల ఉద్యాన పంటల విధానాన్ని వివరిస్తూ గత నాలుగేళ్లలో ఈ విధానం ద్వారా ప్రతి ఏటా మంచి నాణ్యమైన దిగుబడులు తీస్తూ, అధిక ఆదాయాన్ని పొందుతున్నాను అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఈ రవి గౌడ్ కే వి కే శాస్త్రవేత్త, నాగేంద్ర ప్రసాద్ టెక్నికల్ AO,ఆళ్లగడ్డ, కృష్ణ కిషోర్ రెడ్డి,MAO, ఆళ్లగడ్డ, RBK సిబ్బంది, ఏపీ. సీ.ఎం. ఎన్. ఎఫ్. సిబ్బంది,
Ahobilam Hari
మరియు రైతులు పాల్గొన్నారు.