21/09/2024
::*మోరి మోరిపోడు లో ఉన్న జీడిపప్పు వ్యాపారులకి విజ్ఞప్తి*::
తిరుమల తిరుపతి దేవస్థానం లో ప్రస్తుతం జరుగుతున్న కల్తీ మరియు నాణ్యత లేని ప్రసాదం విషయం దేశవ్యాప్తం గా చర్చనీయాంశం అయ్యింది అన్న విషయం అందరికి తెలిసిందే, జంతు కళేబరాల నుండి తీసిన నునె మరియు చేప కొవ్వు ల నుండి తీస్తున్న నూనె ని నెయ్యిలో కలిపి సప్లై చేసారు, దీనితో పాటు గా లడ్డు లో వాడే జీడిపప్పు కూడా నాణ్యతలేదని వార్త బయటకు వచ్చింది, ఒక్కోసారి పురుగు పట్టిన జీడిపప్పు కూడా తిరుమల ప్రసాదం లో వస్తుంది అని ఆ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు నిన్న మీడియా ముఖం గా తెలియచేసారు.
మన మోరి జీడిపప్పు కి దేశవ్యాప్తం గా ఒక మంచి గుర్తింపు వుంది, ఊరిలో అందరూ కూడా నాణ్యత విషయం లో రాజీలేకుండా ఎంతో నిబద్ధత తో జీడిపప్పు ని తయారు చేస్తారు, తిరుమల లడ్డూ ప్రసాదం లో వాడే జీడిపప్పు కనీసం 20 శాతం అయినా మన మోరి మోరిపోడు ప్రాంతం నుండి వెళ్తే బాగుంటాది అని మా అభిప్రాయం, దీనివలన మన వ్యాపారుల అభివృద్ధి కూడా బాగుంటాది, ఈ విషయం మీద మన జీడిపప్పు వ్యాపారులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం ఇస్తే బాగుంటుంది, అవసరం అయితే చంద్ర బాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారిని కలిసి కూడా ఇలా వినతి పత్రం ఇస్తే బాగుంటుంది
ఈ మధ్యన మన మోరి మోరిపోడు జీడిపప్పు వ్యాపారం యువత ఎక్కువ గా చేస్తున్నారు కనీసం యువత అయినా ఈ పని కి ముందుకు వస్తే బాగుంటుంది, తిరుమల లో వాడే మొత్తం జీడిపప్పు అవసరం తీర్చగల కెపాసిటీ మన ఊరి దగ్గర వుంది అని అందరూ గుర్తుపెట్టుకోవాలి🙏🏻